పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.10 పెరిగే అవకాశం!

  • నిన్న లీటర్‌పై రూ.3 పెంపు
  • సమీప భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం
  • దశలవారీగా రూ.10 పెంచే అవకాశం
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ పైన రూ.10 వరకు పెరిగే అవకాశముందని ఎంకే గ్లోబల్ విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే ఈ పెంపు ఒకేసారి లేదా దశలవారీగా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై సగటున రూ.3 పెంచుతూ శుక్రవారం భారత చమురు రంగ కంపెనీలు నిర్ణయించాయి. సమీప భవిష్యత్తులో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తత కారణంగా రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో చమురు కంపెనీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు రూ.3 పెంచాయని, కానీ ఈ పెంపు చాలదని ఎంకే గ్లోబల్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెండు మూడు వారాల్లో దశలవారీగా పెరుగుదల ఉండవచ్చని అన్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ధరల పెరుగుదలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం వసూలును దాదాపు నిలిపివేసింది. ప్రభుత్వరంగ చమురు కంపెనీలు కూడా లాభాలను వదులుకుని అధిక వ్యయాన్ని భరించాయి. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీలు ఇంధన ధరలు పెంచుతున్నాయి. నిన్న పెరిగిన స్వల్ప పెరుగుదల కూడా కంపెనీల రోజువారీ నష్టాలను కొంతమేర తగ్గించిందే తప్ప తొలగించలేదు.

Petrol prices
Diesel prices
Fuel price hike
India fuel prices
Oil price increase
Excise duty
MK Global

More Telugu News